Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక విడుదలయ్యే అవకాశాలు
- మూడేండ్ల తర్వాత బయటకు...
న్యూఢిల్లీ : పశువుల దాణా కుంభకోణంలో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో లాలూ జైలు నుంచి బయటకు రావడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయింది. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దుమ్కా ట్రెజరీకి సంబంధించి రూ.3.13 కోట్లు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఈ కేసు నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయన.. మొత్తం నాలుగు పశుదాణా కుంభ కోణం కేసుల్లో మూడింట్లో గతంలో బెయిల్ పొందారు. ఇప్పుడు ఈ కేసులో కూడా బెయిల్ పొందడంతో... ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంటికి చేరుకునే అవకాశాలున్నాయి. ఆయన తన జైలు జీవితంలో ఎక్కువ భాగాన్ని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లోనే గడిపారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న లాలూనూ గత జనవరిలో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటున్నారు.