Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'మహా' మినిస్టర్ ఆదిత్యా థాక్రే
ముంబయి: దేశంలో త్వరలోనే కరోనా థర్డ్వేవ్ వచ్చే అవకాశముందని మహారాష్ట్ర మంత్రి ఆదిత్యా థాక్రే అన్నారు. దేశంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభించడం.. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలోనే అధికంగా కొత్త కేసులు నమోదుకావడంపై ఆదిత్యా థాక్రే మాట్లాడారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నదనీ, త్వరలోనే థర్డ్వేవ్ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అది ప్రస్తుతం కొనసాగుతున్న సెకండ్ వేవ్ కంటే బలంగా ఉంటుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. కరోనా నివారణకు ప్రస్తుత టీకాలు సహాయపడకున్నా.. భవిష్యత్ కోసం సిద్ధం కావడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆదివారం ఆయన ఎన్డీటీవీ సొల్యూషన్స్ సమ్మిట్లో పాల్గొన్న సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.