Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుపై ఆంక్షలు విధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు 50 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు హాజరవ్వాలని తెలిపింది. మిగిలిన 50 శాతం మంది ఉద్యోగులు ఆన్లైన్ విధానంలో పని చేయాలని పేర్కొంది. అలాగే ఉద్యోగులకు శనివారం సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. విద్యను ఆన్లైన్ విధానంలోనే అనుమతించాలని, సాధ్యమైనంతవరకు ప్రయివేటు ఉద్యోగుల చేత వారి ఇంటి వద్ద నుంచే పని చేయించాలని తెలిపింది. అలాగే 70 ఏండ్ల పైబడిన వారికి అవసరమైన మందులను వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి అందజేయాలని నిర్ణయించింది. కోవిడ్ నిరోధక మార్గరదర్శకాలను పటిష్టంగా అమలు చేయడం కోసం మరింత ఎక్కువమంది పోలీసు సిబ్బదిని, ప్రభుత్వ అధికారులను రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది.