Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : పశ్చిమబెంగాల్లో మరో రెండు దశల ఎన్నికలు మిగిలివున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో వామపక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కరోనా ఉధృతి నేపథ్యంలో భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ.. నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. రస్బిహరి నియోజకవర్గంలో సంయుక్త మోర్చా మద్దతుతో పోటీచేస్తున్న అషుతోస్ చటోపాధ్యాయకు మద్దతుగా ప్రచారం సాగింది. పట్టణంలోని 93వ వార్డులో నిర్వహించిన సభకు లెఫ్ట్ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు, తాలిఘంజ్ సిపిఎం అభ్యర్థి దేవదత్ ఘోష్, పలువురు డివైఎఫ్ఐ నేతలు పాల్గొన్నారు. బెలెఘటలో రోడ్షో నిర్వహించారు. బలిఘంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఫౌద్ హలీంకు మద్దతుగా సభ జరిగింది.