Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పొదుపు సంఘాల మహిళలకు వరుసగా రెండో ఏడాది కూడా 'వైఎస్ఆర్ సున్నా వడ్డీ' పథకాన్ని సీఎం జగన్ జమ చేశారు. శుక్రవారం ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో లబ్దిదారులకు డబ్బు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 1.02 కోట్ల మందికిపైగా పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై ప్రతి నెలా వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వరుసగా రెండో ఏడాది కూడా చెల్లించిందని చెప్పారు. మహిళా సాధికారితను ఆచరణలోకి తీసుకురాగలిగామన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని తెలిపారు. డ్వాక్రా సంఘాల అప్పుపై ఈ ఏడాది వడ్డీ రూ.1109 కోట్లు చెల్లిసున్నామని చెప్పారు. మహిళలకు వ్యాపారపరంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రుణాల పేరుతో మహిళలను మోసం చేసిందని సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. మహిళల రక్షణ కోసం ఎక్కడా రాజీ లేకుండా కృషి చేస్తున్నామని, రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. 900 కొత్త వాహనాలను కొనుగోలు చేశామన్నారు. మద్యం నియంత్రణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.