Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ : దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన 'విరాఫిన్'కు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జైడస్ అందించిన డేటాపై నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే కంపెనీ మూడో దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ప్రయోగాల్లో కేవలం సింగిల్ డోసులతోనే మెరుగైన ఫలితాలు వచ్చినట్టు సంస్థ ఇటీవల వెల్లడించింది. విరాఫిన్ వ్యాక్సిన్ను సాంకేతికంగా 'పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా-2గా పిలుస్తారు. కరోనా రోగులకు చికిత్స కోసం పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా-2 ఔషధంపై జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందుకోసం దాదాపు 250 కరోనా రోగులపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. ఈ ఔషధం తీసుకున్న ఏడు రోజుల్లో 91.15శాతం రోగుల్లో కరోనా నెగెటివ్ (ఆర్టీపీసీఆర్) వచ్చినట్టు ప్రయోగాల్లో గుర్తించింది. అంతేకాకుండా రోగులకు ఆక్సిజన్ అవసరమయ్యే సమయాన్ని 80గంటల నుంచి 56గంటలకు తగ్గించినట్టు తేలింది.