Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో హర్యానాలో మూడో ప్రమాదం
హిసార్ (హర్యానా) : ఆక్సిజన్ అందక ఐదుగురు కరోనా రోగులు మరణించిన సంఘటన సోమవారం ఉదయం హర్యానాలోని హిసార్ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం విచారకరం. ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో ఆదివారం గుర్గావ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నలుగురు, రెవారీలో ఒక ఆసుపత్రిలో నలుగురు మరణించారు. ఈ రెండు సంఘటనలపై విచారణ కొనసాగుతోంది. దేశంలోని మిగిలిన ప్రాంతం మాదిరిగానే హర్యానాలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఇక్కడ 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4.24 లక్షలు దాటింది.