Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్ పాజిటివ్ రిపోర్టు రాకపోయినా.. ఆ లక్షణాలుంటే ఆసుపత్రుల్లో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆప్ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిఎన్ పాటిల్, జస్టిస్ జస్మీత్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలను ఆసుపత్రులు తూచ తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. మినిమిం ఆక్సిజన్ లెవెల్ కన్నా తక్కువ ఉన్న రోగులకు లబ్ధి చేకూరేలా తగిన చర్యలు తీసుకోని, ఆ ఆదేశాలు అందరికీ చేరేలా చూడాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ 23 నుంచే ఈ ఆదేశాలు అమలులో ఉన్నాయని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అనూజ్ అగర్వాల్ కోర్టుకు తెలిపారు. ఇతర దేశాల ఆదేశాలు జారీ అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. కోవిడ్ 19 పరీక్షలు దేశరాజధానిలో నిర్వహించడం లేదని కేంద్రం తరఫు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్శర్మ కోర్టు దష్టికి తీసుకొచ్చారు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ పరీక్షలు చేశారని, ఎక్కువ కేసులు ఉన్నప్పుడు తక్కువ పరీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ కేసుల సంఖ్యను దష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాలను మరిన్ని పెంచాలని, మౌలిక సదుపాయాలను పెంచాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది.