Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాడేపల్లి రూరల్ (గుంటూరు): కెఎల్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్ఎస్ఎస్ రెడ్డి (62) మంగళవారం గుండె పోటుతో కన్నుమూశారు. విజయవాడ ఎల్ఐసి కాలనీలో నివసిస్తున్న ఆయన గత నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరారు. చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. 1995లో కెఎల్యులో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా తన కెరీర్ను ఎల్ఎస్ఎస్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కెఎల్ విశ్వవిద్యాలయంలో రెండుసార్లు ఉపకుల పతిగా పని చేశారు. కేంద్ర, రాష్ట్రస్థాయిలో కెఎల్ డీమ్డ్కు, యూనివర్సిటీకి ఎన్ఎసిసి ప్లస్, బి ప్లస్ వంటి పలు అవార్డులు వచ్చేందుకు ఆయన కృషి చేశారు. ఆయన మృతికి కెఎల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ, సిబ్బంది సంతాపం తెలిపారు. బుధవారం విజయవాడలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.