Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతేడాది అరెస్టు చేసిన కేరళ జర్నలిస్టు సిద్దికీ కప్పన్ను చికిత్స నిమిత్తం మథుర జైలు నుంచి రామ్మనోహర్ లోహియా లేదా ఎయిమ్స్ వంటి ఢిల్లీలోని ఆస్పత్రుల కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా బారినపడిన ఆయన కోలుకున్న తరువాత తిరిగి మథుర కారాగారానికి తీసుకె ళ్లాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎఎస్ బోపన్నల నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించింది.