Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించే క్రమంలో వైరస్ బారినపడుతున్న పాత్రికేయులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. భారత్లోనూ కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్న పాత్రికేయులు అధికమవుతున్నారు. కరోనా కారణంగా సంభవించిన జర్నలిస్టుల మరణాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తాజాగా జెనీవాకు చెందిన ది ప్రెస్ ఎంబ్లేమ్ నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం.. కరోనా కారణంగా సంభవించిన జర్నలిస్టుల మరణాల్లో బ్రెజిల్ (181), పెరూ (140), భారత్ (107) టాప్-3 లో ఉన్నాయి. భారత్లో గత రెండు వారాల్లోనే 45 మంది జర్నలిస్టులు చనిపోయారు. తాజాగా మరో ఏడుగురు జర్నలిస్టులు చనిపోవడంతో ఆ సంఖ్య 114కు పెరిగిందని నివేదిక పేర్కొంది. భారత్ తర్వాతి స్థానంలో మెక్సికో (106), ఇటలీ (52), బంగ్లాదేశ్ (51), కొలంబియా (49), అమెరికా (47)లు ఉన్నాయి. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు 76 దేశాల్లో మొత్తం 1184 మంది జర్నలిస్టులు కరోనాతో మరణించారు.