Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితుల్ని అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భారత్కు సాయమం దించడానికి ముందుకొచ్చాయి. అందులో భాగంగా అమెరికా కూడా అత్యవసర సాయాన్ని అందించనుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గత వారం ట్విటర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా పంపించిన అత్యవసర సాయంగా.. చిక్సితలో భాగంగా 400 ఆక్సిజన్ సిలిండర్లు, పది లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను భారత్కు పంపింది. వీటిని అమెరికా సూపర్ గెలాక్సీ విమానంలో పంపగా.. అది శుక్రవారం ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. 'కోవిడ్తో పోరాడేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు భారత్కు చేరాయి' అని ఈ విషయాన్ని భారత్లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది.