Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాతో 83 మంది మృత్యువాత.. 23,920 కొత్త కేసులు నమోదు
అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. ఆదివారం నాడు ఏకంగా 83 మంది కోవిడ్తో మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ విజంభణతో కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత తొలిసారి 23 వేలకు పైగా కేసులు, 83 మృతులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 23,920 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,45,022 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,66,02,873 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కోవిడ్తో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది చనిపోయారు. విశాఖపట్నం, అనంతపురం, కష్ణా జిల్లాల్లో 8 మంది చొప్పున, ప్రకాశం, విజయనగరంలో ఏడుగురు చొప్పున, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, గుంటూరులో ఐదుగురు, కర్నూల్లో నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మతుల సంఖ్య మొత్తం 8,136కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో రెండు వేలకు పైగా కేసులు నమోదు కాగా ఆరు జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్ బారినపడ్డారు. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,945 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. తూర్పుగోదావరిలో 2,831, శ్రీకాకుళంలో 2,724, కర్నూలులో 2,516, గుంటూరులో 2,384 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 11,411 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 9,93,708కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,178 యాక్టివ్ కేసులున్నాయి.