Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: ఎల్డీఎఫ్ తరపున ఈ సారి 10 మంది కేరళ శాసనసభలోకి అడుగుపెడుతున్నారు. కరోనా నియంత్రణలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ కాకుండా మరో తొమ్మిది మంది వీరిలో ఉన్నారు. వీణాజార్జి యు. ప్రతిభ , ఆర్.బిందు , ఓ.ఎస్ అంబికా, కె. శాంతకుమారి, కె.జమీల, దలీమాజోజోలు సీపీఐ(ఎం) తరపున పోటీ చేసి గెలుపొందారు. సీపీిఐ తరపున సికె ఆశా, జె. చింజురాణి విజయం సాధించారు. యూడీఎఫ్ తరపున వడక్కర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన కెకె రమ ఒక్కరే మహిళా అభ్యర్థి.