Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరోబోగ్లో బీజేపీని మట్టి కరిపించిన సీపీఐ(ఎం) అభ్యర్థి
- 21 వేల భారీ మెజార్టీతో మనోరంజన్ గెలుపు
న్యూఢిల్లీ: అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరపున పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీపీఐ(ఎం)కు చోటుదక్కింది. సరోబోగ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) తరపున పోటీ చేసిన మనోరంజన్ తల్కూదర్ ఘన విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి శంకర్ చంద్ర దాస్ (33,030 (35.19 శాతం))పై సీపీఐ(ఎం) అభ్యర్థి మనోరంజన్ (55,014(58.62 శాతం)) 21,984 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయనను గెలిపించినందుకు అసోం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది.