Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పనితీరుకు ప్రజలు పట్టం కట్టారని సీపీఐ(ఎం) నేత ప్రకాశ్ కారత్ అన్నారు. కేరళలో గత 40 ఏండ్లలో ఒక ప్రభుత్వాన్ని వరసగా రెండో సారి ఎన్నుకున్నారంటే ఇది గణనీయమైన విజయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎల్డీఎప్ విజయంపై మాట్లాడిన ఆయన వరదల సమయంలో, కరోనా మమ్మారి సమయంలో, ప్రజాభివృద్ధిలో సీఎం పినరయి విజయన్ పనితీరును కేరళ ప్రజలు మెచ్చుకున్నారనీ, ఈ గెలుపు నిరూపిస్తోందని ప్రకాశ్ కారత్ అన్నారు.