Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను రాజ్భవన్లో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు అందజేశారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకూ పదవిలో ఉండాలని విజయన్ను గవర్నర్ ఈ సందర్భంగా కోరారు. చరిత్రను తిరగరాస్తూ కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే తేదీని ఎల్డిఎఫ్ సమావేశం తరువాత నిర్ణయిస్తామని విజయన్ తెలిపారు.