Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చర్ల
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిమ్మల గూడెం గ్రామానికి చెందిన ఐదుగురు సీపీఐ మావోయిస్టు పార్టీ మిలీ షియా సభ్యులను మంగళవారం కుర్నపల్లి అడవిలో అరెస్టు చేసినట్టు చర్ల సీఐ బి.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులోని వివరాలిలా ఉన్నాయి.. నిమ్మలగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు కొవ్వాసి అడమయ్య, మడకం దుర్గారావు(దుర్గేష్), ఎకో సూల(లచ్చ), ఊకే సారయ్య, మడివి గంగయ్య కొంతకాలంగా నిషేధిత మావోయిస్టు పార్టీకి మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారు. తెలంగాణ - ఛత్తీస ్గఢ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన చర్ల - కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధి లోని సంచరిస్తూ పోలీసుల కదలికల గురించి మావోయిస్టు పార్టీ సభ్యు లకు చేరవేస్తున్నారు.