Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్పై పెరుగుతున్న ట్రావెల్బ్యాన్
న్యూఢిల్లీ : భారత్ నుంచి మా దేశానికి రావొద్దు అంటున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్-19 రెండో ప్రభంజనం తీవ్రంగా ఉండటంతో బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు ఇప్పటికే భారతీయ ప్రయాణికులపై నిషేధం విధించాయి. ఆ జాబితాలో తాజాగా శ్రీలంక చేరింది. శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో భారత దేశం నుంచి శ్రీలంకకు జరిగే ప్రయాణాలపై పూర్తిగా నిషేధం విధించినట్చు తెలిపింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల ను శ్రీలంకలోకి అనుమతించేది లేదని తెలిపింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. భారత్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరు గుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్తు తెలిపింది. ఈ ఆదేశాలను శ్రీలంక ఎయిర్లైన్స్ సీఈఓకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఓ లేఖ ద్వారా పంపించారు. శ్రీలంక ఆరోగ్య శాఖాధికారుల సూచనల మేరకు ఈ ఆదేశా లను జారీ చేసినట్టు తెలిపారు. మన దేశం నుంచి పశ్చిమాసియా, సింగపూర్ వెళ్ళే ప్రయాణికులకు శ్రీలంక ఓ మజిలీ కేంద్రంగా ఉంది. ట్రావెల్ బబుల్లో భాగంగా ఇండియన్ టూరిస్టులను శ్రీలంక టూరిజం అధికారులు అనుమతిం చాల్సి ఉంటుంది. శ్రీలంకలో గడిచిన ఐదు రోజుల్లో రోజుకు సుమారు 2,000 చొప్పున కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.