Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని విజయోత్సవ వేడుకలను శుక్రవారం వినూత్న రీతిలో నిర్వహించారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నిరాడంబరంగా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని ఎల్డీఎఫ్ తన కార్యకర్తలకు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఎవరికి వారు ఇంటి ముందు కాగడాలు, కొవ్వొత్తులు వెలిగించి విజయోత్సవ వేడుకలను శుక్రవారం జరుపుకున్నారు. దీనిలో భాగంగా తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్ వద్ద సీపీిఐ(ఎం) సీనియర్ నేత ఎస్.రామచంద్రన్ పిళై ఆధ్యర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.