Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ రెమ్డెసివర్ రాకెట్ గుట్టురటు
భోపాల్ : దేశంలో మహమ్మారి ప్రాణాలు తీస్తోంటే మరికొంత మంది దీన్ని క్యాష్ చేసుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు. అలా కరోనా చికిత్సలో వినియోగించే రెమ్డెసివర్ నకిలీ ఔషధాన్ని కొనుగోలు చేసిన ఓఆస్పత్రి గుట్టు రట్టు చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. నేరానికి పాల్పడ్డ ఆస్పత్రి డైరెక్టర్తో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రంలోని జబల్పూర్లో జరిగింది. నిం దితుడు సరబ్జీత్ సింగ్ మోఖా నర్మదా డివిజన్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు. వివరాల్లోకి వెళితే జబల్పూర్ సిటీ హాస్పిటల్కు సరబ్జీత్ సింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇండోర్ను సుమారు 500 నకిలి రెమిడెసివిర్ ఇంజెక్షన్లను తెప్పించి...కోవిడ్ -19 రోగులకు అందించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనపై ఐపీసీలోని 274, 275, 308, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.