Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులకు ప్రత్యేక యాప్
- ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ
- ప్రత్యక్ష ప్రసారాలకు సిద్ధంగా ఉన్నాం..
- కోర్టు కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకే ఈ నిర్ణయమని వ్యాఖ్య
న్యూఢిల్లీ: కరోనా పరిస్థితుల నేపథ్యం లో జర్నలిస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ గురువారం ప్రారంభించారు. జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ధనుంజరుల కమిటీ ఈ యాప్నకు రూపకల్పన చేసినట్టు జస్టిస్ రమణ తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు సాంకేతిక బృందం ఈ యాప్ను రూపొందించినట్టు చెప్పారు. జర్నలిస్టులు ఇకపై ఉన్న చోటు నుంచే సుప్రీంకోర్టు రోజువారీ కార్యకలాపాలను రిపోర్ట్ చేసేందుకు ఈ అవకాశం కల్పించామన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకుగాను సాంకేతికంగా ముందుకెళ్లాలని భావించినట్టు సీజేఐ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలన్నీ ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్టు సీజేఐ వెల్లడించారు. సహ న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వివరించారు. ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తమకు తెలుసని చెప్పారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు సీజేఐ స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల మంజూరులో ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.జర్నలిస్టులకు ప్రత్యేక యాప్ సాంకేతిక బృందం ఈ యాప్ను రూపొందించినట్టు చెప్పారు. జర్నలిస్టులు ఇకపై ఉన్న చోటు నుంచే సుప్రీంకోర్టు రోజువారీ కార్యకలాపాలను రిపోర్ట్ చేసేందుకు ఈ అవకాశం కల్పించామన్నారు. కోర్టులో జరిగే కార్యకలాపాలు పారదర్శకంగా ఉండేందుకుగాను సాంకేతికంగా ముందుకెళ్లాలని భావించినట్టు సీజేఐ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు కార్యకలాపాలన్నీ ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్టు సీజేఐ వెల్లడించారు. సహ న్యాయమూర్తులతో చర్చించి రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని వివరించారు. ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు. ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తమకు తెలుసని చెప్పారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు సీజేఐ స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ల మంజూరులో ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.