Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం: కేరళలో ఇప్పటికే కొనసాగుతున్న పూర్తి లాక్డౌన్ను ఈ నెల 23 వరకూ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న తిరువనంతపురం, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం జిల్లాల్లో ట్రిపుల్ లాక్డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో పేదలకు అందిస్తున్న ఉచిత ఆహారం కిట్లను మే, జూన్ మాసాల్లోనూ పంపిణీ చేస్తామని విజయన్ తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి మే 17 నుంచి టీకా పంపిణీ ప్రారంభించనున్నట్టు విజయన్ తెలిపారు. కంపెనీకి నేరుగా ఆర్డర్ చేయగా.. తొలి బ్యాచ్ కోవిషీల్డ్ టీకాలు సోమవారం కోచికి చేరాయని తెలిపారు.తమిళనాడులో నేటి నుంచి 10 గంటల వరకే దుకాణాలు
శనివారం నుంచి ఈ నెల 24 వరకూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరిచివుంచేవారు. ఆ సమాయాన్ని తాజాగా కుదించారు.