Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, వెంటిలేటర్లు సేమ్ టు సేమ్, అవసరమైనప్పుడు రెండూ పనిచేయడం లేదని రాహుల్ గాంధీ ట్విట్టర్లో మోడీకి చురకలు అంటించారు. 'పిఎం కేర్స్ నిధులతో కొనుగోలు చేసిన వెంటిలేటర్లకు, ప్రధాన మంత్రికి చాలా పోలికలు ఉన్నాయి. రెండూ తప్పుడు ప్రచారాలతో ఉన్నాయి. ఈ రెండూ తమ విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యాయి. అవసరమైన సమయా ల్లో ఈ రెండూ పనిచేస్తాయని ఆశించడం కష్టం' అంటూ మండిపడ్డారు. పిఎంకేర్స్ తో కేంద్రం కొనుగోలు చేసిన వెంటిలేటర్లు.. పంజాబ్లోని ఫరీద్ కోట్లోని గురు గోవింద్ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రికి సరఫరా చేయగా.. సాంకేతిక సమస్యలతో అవి పనిచేయడం లేదన్న నివేదికలపై రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.