Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్లో 10.46 శాతానికి
- ద్రవ్యోల్బణానికి చమురు మంట
న్యూఢిల్లీ : కరోనా వైరస్ను కట్టడి చేయలేని ప్రభుత్వాల వైఫల్యాలతో ఓ వైపు ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోతుంటే మరోవైపు దేశంలో ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఇంధన బాదుడు విధా నాలతో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగ డంతో ప్రస్తుత ఏడాది ఏప్రిల్లో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఇదివరకు ఎప్పుడూ లేని విధం గా 10.49 శాతానికి ఎగబాకింది. ముడిచమురు, నూనెలు, కమాడిటీ ధరల పెరుగుదలతో ద్రవ్యో ల్బణం రెండంకెలకు ఎగిసిందని సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.