Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చికిత్సపొందుతూ సుందర్లాల్ బహుగుణ కన్నుమూత
రిషికేశ్: ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ (94)కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయనను చికిత్స నిమిత్తం రిషికేశ్లోని ఎయిమ్స్లో చేర్పించారు. పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బహుగుణ కరోనా నుంచి కోలుకోలేకపోయారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సుందర్లాగ్ బహుగుణ మృతిపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. పర్యావరణంతో మమేకమై జీవించే మన శతాబ్దాల సంస్కృతికి ఒక రూపం ఇచ్చారన్నారు.హిమాలయ ప్రాంతాల్లో అడవుల నరికివేతను వ్యతిరేకిస్తూ సుందర్లాల్ బహుగుణ ఎన్నో ఉద్యమాలు చేశారు. పర్యావరణ ప్రాముఖ్యత అందరికీ అర్థమయ్యే రీతిలో 1970ల్లో ప్రారంభించిన చిప్కో ఉద్యమానికి నేతృత్వం వహించారు. దీంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. టెహ్రీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమంలోనూ సుందర్లాల్ ప్రముఖ పాత్ర పోషించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1981లో పద్మశ్రీ, 2009లో పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.ఆయన మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.