Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ సమాచారాన్ని తొలగించండి..
- సామాజిక మాధ్యమాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ : కరోనా వైరస్కు సంబంధించి 'ఇండియన్ వేరియెంట్' అని సూచించే ఎటువంటి సమాచారమైనా వెంటనే తొలగించాలని కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ సోషల్ మీడియా సంస్థలకు లేఖ రాసింది. ఇక బి.1.617 అనేది 'ఇండియన్ వేరియెంట్' అని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా చెప్పలేదని, అలా చెప్పేందుకు ఇతర ఆధారాల్లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఆ వేరియెంట్ను డబ్ల్యూహెచ్ఓ కేవలం బి.1.617గా వర్గీకరించిందని పేర్కొంది. 'ఇండియన్ వేరియెంట్' అని ప్రస్తావించడం అసత్యాన్ని వ్యాప్తి చేయటమేనని, ఇది దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదముందని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియెంట్లను వైద్యులు, ఆరోగ్య నిపుణులు సాధారణంగా గుర్తిస్తారు. ఇందులో భాగమే దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో గుర్తించిన కరోనా వేరియెంట్స్. అయితే చాలా మీడియా సంస్థలు ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ బి.1.617ను 'ఇండియన్ వేరియెంట్' అంటూ కథనాలను ప్రచురిస్తున్నాయని, ఇది ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.