Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వలస కార్మికుల రిజిస్ట్రేషన్పై సుప్రీం అసంతృప్తి
- పథకాల ప్రయోజనం లబ్దిదారులకు చేరట్లే..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో మళ్లీ లాక్డౌన్లు అమలవుతున్న వేళ వలస కూలీల రిజిస్ట్రే షన్ ప్రక్రియపై సు ప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వలస కార్మికుల సమస్యలపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం..'ఆత్మనిర్భర్ భారత్' ప్రయోజనాలు వలస కూలీలకు అందుతున్నాయా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. పథకాలు ఉన్నప్ప టికీ, ప్రభుత్వ గుర్తింపు లేక ఎంతోమంది వాటిని పొందలేకపోతున్నారని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అసంఘటిత రంగంలోని వలస కార్మికుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్, జాతీయ ఆహారభద్రత చట్టం వంటివి వలస కార్మికులకు వర్తిస్తాయా? లేదా? అన్నదానిపై న్యాయస్థానం ఆరా తీసింది. ఆత్మ నిర్భర్ భారత్ ప్రయోజనాలు వలస కూలీలు పొందుతున్నారో లేదో తెలపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించింది. సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ (వలస కూలీగా గుర్తింపు) కోసం వలస కార్మికుడు ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించవచ్చునని, అయితే లాక్డౌన్వేళ ప్రభుత్వమే వారి దగ్గరికివెళ్లాలని న్యాయస్థానం సూచించింది. ఉపాధికోల్పోయిన వలస కార్మికులందరికీ పథకం ప్రయోజనాలు వర్తింపజేయాలని సూచించింది.
నత్తనడక సాగుతోంది..
''గుర్తింపు, నమోదు ఉంటేనే వలస కూలీలకు పలు పథకాల ద్వారా లబ్ది చేకూరుతుంది. గతేడాది వలస కూలీల రిజిస్ట్రేషన్ చేపట్టాలని ఆదేశించిన ప్పటికీ అది నత్తనడకన సాగుతోంది. దాంతో పథకాలు ఉన్నప్పటికీ అవి లబ్ది దారులకు చేరట్లేదు. మహమ్మారి సంక్షోభ సమయంలో వలస కార్మికులకు ఆహారం, రవాణావంటి సదుపాయాలు కల్పించాలి. సంఘటిత, అసంఘటిత కార్మికులందరినీ నమోదు చేయాలి'' అని ధర్మాసనం సూచించింది.