Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: బెంగాల్లో కరోనా పంజా విసురుతోంది. ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాతి నుంచి కరోనా మహమ్మారి ప్రభావం అధిక మైంది. దీంతో కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధాని కోల్కతాలో కరోనా కేసులు, మరణాలు గతేడా దితో పోలిస్తే.. ప్రస్తుతం రికార్డు స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. మునుపటి సంవత్సరంతో పోలిస్తే మరణాలు 4.5 రేట్లు అధికంగా.. 1371 మరణాలు నమోదయ్యాయి. కరోనా సెకండ్వేవ్ ప్రారంభమైన ఏప్రిల్-మే (27) మధ్య కాలంలో అధికంగా 1,198 మరణాలు సంభవించాయి.