Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మందగమనంలో ఉందని కార్పొరేట్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. కరోనా ముందు నాటి స్థాయికి వాహన అమ్మకాలు చేరడానికి మరో రెండేండ్లు పట్టొచ్చని మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ (సీఈఓ) అనిష్ షా పేర్కొన్నారు. వైరస్ కేసులు తగ్గి.. ఆర్థిక వ్యవస్థ రికవరీ కావడానికి చాలా సమయమే పట్టొచ్చని రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ ముందు నాటి స్థాయికి వాహన అమ్మకాలు చేరొచ్చని విశ్లేషించారు. వ్యాక్సినేషన్ అందించే స్థాయి, సమయాన్ని బట్టి సాధారణ పరిస్థితులు ఆధారపడి ఉంటాయన్నారు.