Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ తాజా ఆదేశాల అమలుకు ఒప్పుకునేది లేదని హెచ్చరిక
న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో కేంద్రం తాజాగా జారీ చేసిన ఆదేశాల విషయంలో ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ సర్కారు జారీ చేసిన ఆదేశాలను అసోంలో అమలు చేయడానికి ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. విదేశీ సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ఒప్పందం ఉన్నదని తెలిపింది. ఈ విషయంలో ఆందోళనకు దిగుతామని ఆసు అధ్యక్షుడు దీపాంక కుమార్ నాథ్ కేంద్రాన్ని హెచ్చరించారు.