Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యమహా మోటార్ ఇండియా తన రెండు మోడళ్ల ధరలను తగ్గిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎఫ్జెడ్ఎస్ 25 ధరను రూ.19,300 మేర తగ్గించగా, ఎఫ్జెడ్ 25 ధరలో రూ.18,800 కోత పెట్టింది. దీంతో ఢిల్లీ ఎక్స్షోరూం వద్ద వరుసగా వీటి ధరలను రూ.1,39,300గా, రూ.1,34,800గా నిర్ణయించినట్లు ఆ కంపెనీ వెల్లడించింది.