Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణతో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని అన్నారు. కరోనా వైరస్ ఉధృతితో విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉండటం సహజమేనన్న ప్రధాని.. ఇలాంటి ఒత్తిడి పరిస్థితుల్లో పరీక్షలు రాసేందుకు విద్యార్థులను బలవంత పెట్టొద్దని సూచించారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా తీవ్రత తగ్గాక పరీక్షలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే.