Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రామ్దేవ్బాబాకు ఢిల్లీ హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్ అసోషియేషన్(డిఎంఎ) దాఖలు చేసిన దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 13వ తేదీ వరకు వాయిదా వేసిన కోర్టు, అప్పటి వరకు ఆయన ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. కొరోనిల్ టాబ్లెట్లతో కరోనా తగ్గుతుందని.. రామ్దేవ్కు చెందిన కంపెనీ పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొంటూ డిఎంఎ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇటీవల అల్లోపతిపై రామ్దేవ్ చేసిన వ్యాఖ్యలపై ఐఎంఎ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.