Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: కరోనా సమయంలో పోలీసులు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ప్రభుత్వం గురువారం నగదు ప్రోత్సాహకం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.17 లక్షల మంది పోలీసు సిబ్బందికి రూ.5 వేల చొప్పున నగదును ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం ప్రకటించారు. కరోనా మొదటి, రెండవ దశల్లో, పోలీసు సిబ్బందితో సహా ఫ్రంట్ లైన్ కార్మికులు వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. కింది స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ల స్థాయి వరకు పోలీసు సిబ్బంది ఈ నగదు ప్రోత్సాహకాన్ని పొందేందుకు అర్హులని తెలిపింది.