Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: కోవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే ఫలితాలను ప్రకటించేందుకు ఇంకా మూల్యాంకన నమూనా ప్రక్రియను ఖరారు చేయలేదని పేర్కొంది. బుధవారం మీడియా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని చెప్పారు. 12 తరగతి బోర్డు పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం అంతకుముందు నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్లో నిర్వహించాలనుకున్న 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది.