Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ
దేశంలో కరోనా వైరస్ రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం నుంచి గురువారం వరకు 24 గంటల వ్యవధిలో 1,34,154 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవి గత రోజుతో పోలిస్తే రెండు వేలు అధికంగా ఉన్నాయి. ఇక మరణాలు 2,887 సంభవించాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది.
కర్ణాటకలో లాక్డౌన్ కొనసాగింపు
కర్ణాటకలో కరోనా ఉధృతి నేపథ్యంలో లాక్డౌన్ ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సిఎం యూడియూరప్ప గురువారం ప్రకటించారు. మరోవైపు లాక్డౌన్ ఆంక్షలను సడలించేందుకు మహరాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. ఇప్పుడున్న ఆంక్షలు ఈనెల 15 వరకు కొనసాగనున్నప్పటికీ ఆ తర్వాతి వ్యూహాన్ని ప్రభుత్వం ముందుగానే వెల్లడించింది. కోవిడ్ తీవ్రతను బట్టి జిల్లాలను ఐదు స్థాయిలుగా వర్గీకరించిన ప్రభుత్వం, వాటికి అనుగునంగా ఆంక్షలను సడలిస్తామని తెలిపింది.