Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ : దైవ భూమిగా కొలిచే ఉత్తరాఖండ్లో లింగ పుట్టుక నిష్పత్తిలో వెనకబడి ఉంది. నిటి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీల నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశ సగటు లింగ నిష్పత్తి 899తో పోలిస్తే రాష్ట్ర నిష్పత్తి 840గా ఉంది. అంటే కేవలం ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు కేవలం 840 మంది ఆడపిల్లలు మాత్రమే జన్మిస్తున్నారు. ఇం దులో మెరుగైన పనితీరుతో ఛత్తీస్గఢ్ ముందంజలో ఉంది. అక్కడ ఆడ-మగ పుట్టుక నిష్పత్తి(958)... జాతీయ సగటు కన్నా అధికంగా ఉండటం విశేషం. ఛత్తీస్గఢ్ తర్వాత స్థానాన్ని కేరళ కైవసం చేసుకున్నది. ఇక్కడ లింగ నిష్పత్తి 957గా ఉంది.గతంలో లింగ నిష్పత్తిలో వెనుకబడ్డ పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు మెరుగుపడ్డాయి.హర్యానాలో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు గానూ 843 మంది ఆడ పిల్లలు జన్మిస్తుండగా...పంజాబ్లో ఆ సంఖ్య 890గా ఉంది.ఇటీవల నిటి అయోగ్ విడుదల చేసిన ఎస్డీజీ సూచికలో 75 పాయి ంట్లతో కేరళ తొలి స్థానంలో నిలువగా, బీహార్ 52 పాయింట్లతో అతి పేలవ మైన ప్రదర్శన కనబర్చిన సంగతి విదితమే. కాగా, దేశం మొత్తంగా ఎస్జిడి పరంగా ఆరు పాయింట్లు మెరుగుపడ్డప్పటికీ...ప్రపంచ కోణంలో భారత్ 115వ స్థానానికి పడిపోయింది. ఎస్డీజీ అనేది పర్యావరణం, ఆరోగ్యం, శ్రేయ స్సు, లింగ సమానత్వం, పారిశుధ్ధ్యం, ఇతర అంశాల పురోగతి ఆధారంగా రాష్ట్రా లకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పాయింట్లను నిటి అయోగ్ విడుదల చేస్తోంది.