Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లాక్డౌన్ నిబంధనలతో గడిచిన మే మాసంలో దేశంలో చమురు డిమాండ్ 15.11 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. ఇంతక్రితం మాసం ఏప్రిల్తో పోల్చితే 11.3 శాతం క్షీణించి.. తొమ్మిది మాసాల కనిష్టానికి దిగజారిందని చమురు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పెట్రోలియం ప్లానింగ్ అనలిసిస్ సెల్ (పీపీఏసీ) వెల్లడించింది. లాక్డౌన్ నిబంధనలతో డిమాండ్ దెబ్బతినిందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిస్ట్ పేర్కొన్నారు. అదే విధంగా అధిక ధరలు కూడా వినిమయం తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్థిలో డీజిల్ అత్యంత కీలకమైంది. మొత్తం ఇంధన వినియోగంలో దీని వాటా 40 శాతంగా ఉంది.