Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని లాజ్పత్ నగర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ షోరూమ్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు ఉదయం 10.30 గంటల సమయంలో ప్రమాదస్థలికి 30 ఫైర్ టెండర్లను తరలించి మధ్యాహ్నం 2.30 గంటలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు. భారీగా మంటలు, పొగ ఎగిసిపడుతున్న నేపథ్యంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 100 మంది ఫైర్ సిబ్బంది పనిచేశారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే, మంటలు ఉయదయమే అంటుకుని ఉండవచ్చుననీ.. అదే సమయంలో షోరూంలు మూసివుండటంతో నాలుగు షోరూంలకు మంటలు వ్యాపించేవరకు ఎవరూ గమనించలేకపోయారనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. అలాగే, ప్రమాదం జరిగిన స్థలం వస్త్ర దుకాణాలు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయని తెలిపారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా అక్కడి పరిసర ప్రాంతాలన్నీ పొగతో నిండిపోయాయి.