Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కరోనా నిర్వహణలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందంటూ కాంగ్రెెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా సంక్షోభంలో మోడీ విఫలమైనా.. కేంద్రంలో సమర్ధవంతంగా పనిచేసే శాఖ ఒకటుందని రాహుల్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ''భారత ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతమైన శాఖ ఏదంటే.. అబద్ధాలు, ఉత్తుత్తి నినాదాలతో కూడిన సీక్రెట్ మంత్రిత్వ శాఖ'' అని ఎద్దేవా చేశారు. కరోనా తరువాత కూడా ద్రవ్యోల్బణం, నిరుద్యోగితపై నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్న వ్యక్తి ఎవరో దేశ ప్రజలందరికీ తెలుసునని ట్విట్టర్లో విరుచుకుపడ్డారు.