Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో తక్కువే కానీ.. ప్రపంచ దేశాల ఆందోళన !
న్యూఢిల్లీ: గతేడాది వెలుగు చూసిన కరోనా మహమ్మారి అనేక ఉత్పరివర్తనాలు చెందుతూ.. తన రూపును మార్చుకుంటూ మరింత ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ప్రపంచ దేశాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో పలు రకాల వేరియంట్లు తీవ్ర స్థాయలో విజృంభించి.. పరిస్థితితులను మరింత దారుణంగా మార్చాయి. భారత్లో కరోనా సెకండ్ వేవ్కు కారణమైన డేల్టా వేరియంట్.. మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ప్రస్తుతం ఈ డెల్లా వేరియంట్ కాస్తా మ్యూటెంట్ అయి డెల్టాప్లస్గా (ఏవై1 వేరియంట్) మారింది. ఈ నేపథ్యంలోనే పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. డెల్టాప్లస్ వేరియంట్ నేపథ్యంలో బ్రిటన్లో జులై 19 వరకు ఆంక్షలు పొడిగిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని బోరీస్ జాన్సన్ ప్రకటించారు. ఇదివరకే డెల్టా వేరియంట్ను ప్రమాదకర మ్యూటెంట్లలో ఒకటిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గుర్తించింది. ఈ వేరియంట్పై సర్వత్రా ఆందోళన వ్యక్తం కావడానికి ప్రధాన కారణం.. ఇప్పటివరకూ కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ను చికిత్సకు వ్యతిరేక ప్రతిఘటనను చూపిస్తోంది. ఈ రకం వేరియంట్ భారత్లో ఎక్కువగా లేదనీ, ఈ నెల 7వరకు ఆరు జీనోమ్స్లో డెల్టాప్లస్ వేరియంట్ను గుర్తించినట్టు నిపుణులు చెబుతున్నారు.
డెల్టాప్లస్ వేరియంట్ గురించి పరిశోధకులు మాట్లాడుతూ.. కే417ఎన్ మ్యుటేషన్ ద్వారా కరోనా బీ1617.2 వేరియంట్ వచ్చినట్టు వెల్లడించారు. ఇదే డెల్టా ప్లస్ వేరియంట్ (బీ1617.2.1). ఈ కే417ఎన్లోనూ రెండు గ్రూపులు ఉండగా, అందులో ఒకటి పలు దేశాల్లో కనిపించింది.
మరొకటి అమెరికాలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఎస్వో) పరిశోధనలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జీఐఎస్ఏఐడీలో జరిగిన 63 జీనోమ్ సీక్వెన్స్లలో డెల్టా ప్లస్ వేరియంట్టు గుర్తించారు. ఇవి కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, భారత్, పోలాండ్, పోర్చుగల్, జపాన్, అమెరికాలకు చెందినవి. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు యూకేలో 36, అమెరికాలో మొత్తం కేసుల్లో 6 శాతం ఉన్నట్టు గుర్తించారు.