Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్బీఐ అంచనా
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వచ్చే ఆగస్టులో నిర్వహించనున్న ద్రవ్య పరపతి సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే కొనసాగించే అవకాశాలున్నాయి. పలు అంతర్జాతీయ, దేశీయ పరిణామాల నేపథ్యంలో యథాతథ పరిస్థితిని కొనసాగించవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్- ఎకోరప్ రిపోర్ట్లో పేర్కొంది. వచ్చే మాసాల్లో ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చని అంచనా వేసింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీ ఆగస్టు 4 నుంచి 6వ తేదిల్లో జరగనున్నది.