Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వేర్వేరు భాషలు మాట్లాడే ఇద్దరు వ్యక్తులు వారివారి భాషల్లో మాట్లాడుతుండగానే రియల్ టైంలో ఎదుటి వ్యక్తి భాషలోకి అనువాదం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి శాఖ కార్యదర్శి అజరు ప్రకాష్ సాహ్నీ శనివారం తెలిపారు. నేషనల్ ఇంటర్నెట్ ఎక్ఛేంజీ (ఎన్ఐఎక్స్ఐ) 18 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఇతర అత్యాధునిక సాంకేతికతలను వినియోగించుకొని భాషా అడ్డుగోడలను తొలగించే దిశగా చేపట్టిన ఈ భాషా అనువాద ప్రాజెక్టును రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.