Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పన్నుల వసూళ్లలో కేంద్రం పిహెచ్డి చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ సర్కార్పై ధ్వజమెత్తారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల ద్వారా వసూలైనదాని కన్నా పెట్రోలు, డీజిల్ల నుంచి కేంద్రం అధిక ఆదాయాన్ని పొందుతోందని ఆదివారం రాహుల్ ట్వీట్ చేశారు. ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వం పొందుతోందంటూ ఒక పత్రిక ఇచ్చిన కథనాన్ని ట్వీట్కు జత చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు శనివారం మాత్రమే నిలకడగా ఉన్నాయి. ఆదివారం మళ్ళీ పెరిగాయి. దేశంలోని అధిక నగరాల్లో లీటరు పెట్రోలు ధర రూ.100 దాటింది. మరికొన్ని నగరాల్లో రూ.100కు చేరువలో ఉంది.