Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వస్తు, సేవలపై పన్నులు తగ్గాయని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. జీఎస్టీకి ముందు తల నూనె, టూత్ పేస్ట్, సబ్బులపై 29.3 శాతం పన్ను అమల్లో ఉన్నదనీ.. ఇప్పుడు ఇవి 18 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని తెలిపింది. పలు గృహోపకరణాలపై పన్నులు 31.3 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయని పేర్కొంది. స్థూలంగా 400 రకాల వస్తువులు, 80 రకాల సేవలపై పన్ను తగ్గిందని తెలిపింది. దేశంలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అనేక ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగాయనీ.. దీంతో వినియోగదారులపై భారం పెరిగిందని అనేక రిపో ర్టులు పేర్కొనగా... ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేయడం విశేషం.