Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధర్మబాద్ : భారీ వర్షాలకు ఎగువ నుంచి చేరుతోన్న వరద నీటి కారణంగా... మహారాష్ట్రలోని ధర్మబాద్ వద్ద గోదావరిపై ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అధికారులు పూర్తిగా ఎత్తివేశారు. గురువారం ఉదయం 3 గేట్లు సీడబ్ల్యూసీని ఉమ్మడి రెండు రాష్ట్ర నీటి పారుదల అధికారుల సమక్షంలో ఎత్తారు. శుక్రవారం ఉదయం వరకు అధికారులు మొత్తం 14 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్ట్లో 0.93 టిఎంసి ల నీరు ఉండగా.. అది 80 కిలోమీటర్లు ప్రవహించి శ్రీరాం సాగర్కు చేరుకుంటుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్లో గురువారం 27 టీఎంసీల నీరు ఉండగా.. శుక్రవారం ఉదయం 6 గంటలకు 28.682 టీఎంసీల నీరు ఉంది. గత 24 గంటల్లో ఒక టీఎంసీ నీరు వచ్చి చేరింది. సుమారు 20,299 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్టు ప్రాజెక్ట్ ఏఈఈ వంశీ తెలిపారు. టోటల్ 647 అవుట్ ఫ్లో కొనసాగుతుంది. శ్రీరాం ప్రాజెక్టులోకి జూన్ 1 నుంచి ఇప్పటివరకు 11.95 టీఎంసీల గోదావరి నీరు వచ్చి చేరింది. తెలంగాణ సరిహద్దు త్రివేణి సంగమం వద్ద ప్రస్తుతం గోదావరి పరవళ్లు తొక్కుతుంది.