Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్ జిల్లాలో డ్రోన్లు, ఇతర మానవరహిత విహంగ వాహనాలను ఉపయోగించడం, కలిగి ఉండటంపై నిషేధం విధించారు. జమ్ముకాశ్మీర్ పరిపాలన విభాగం ఆదివారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వారం రోజుల క్రితం జమ్ములోని వైమానిక కేంద్రంపై డ్రోన్ల దాడి జరగడంతో ఈ నిషేధం విధించారు. వాటివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఈ నిషేధం విధించినట్లు శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ మహమ్మద్ అయిజ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.