Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,071 కరోనా కేసులు వెలుగులోకివచ్చాయి. అంతకుముందు రోజుతో పోల్చితే 2 శాతం తక్కువగా కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్యలో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18,38,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల సంఖ్య 41.28 కోట్లకు చేరింది. క్రితం రోజుతో పోల్చితే మరణాల సంఖ్య కాస్త పెరిగింది. గడిచిన 24 గంటల్లో 955 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,02,005కి చేరింది. గడిచిన 24 గంటల్లో 52,299 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,96,58,078కి చేరి.. దీంతో రికవరీ రేటు 97.09 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,85,350 క్రియాశీల కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 63,87,849 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ అయినా టీకా డోసుల సంఖ్య 35,12,21,306కు చేరింది.