Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ రాజధానిలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత: ది ఎకానమిస్ట్ నివేదిక
న్యూఢిల్లీ: మానవ చర్యలతో ప్రకృతి విధ్వంసం కారణంగా భూ వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మైనస్ స్థాయికి చేరుకుంటున్నాయి. భారత్లోనూ గత కొన్ని సంవత్సరాలుగా ఎండలు మండిపోతున్నాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవల నమోదైన ఉష్ణోగ్రతలు 90 ఏండ్ల రికార్డును సైతం చెరిపేశాయి. ఉష్ణోగ్రతల మార్పునకు సంబంధించి యూరప్ మీడియా గ్రూప్ ఎకనామిస్ట్ నివేదిక ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2041 నాటికి భారత్లో ఉష్ణోగ్రతలు ప్రాణాంతక స్థాయికి చేరుకుంటాయని హెచ్చరించింది. అప్పటికి ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 49.3 డిగ్రీలకు చేరుకుంటాయని పేర్కొంది.దక్షిణ భారతంలోనూ 2041 నాటికి ఏండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంటుందనీ, మరీ ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైలో ఎండల మండిపోనున్నాయని నివేదిక పేర్కొంది. దీని కారణంగా అనారోగ్యానికి గురయ్యే వారి సంఖ్య క్రమంగా పెరిగి.. ఆస్పత్రులు నిండిపోనున్నాయని తెలిపింది. గత 26 సంవత్సరాలుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఎండలు తీవ్రత కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతున్నదని వెల్లడించింది. ది ఎకానమిస్ట్ ప్రతియేటా భూ వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, మార్పులకు సంబంధించిన అంచనాలు రూపొందించి వెల్లడిస్తుంటుంది. భూమిపై ఉష్ణోగ్రతలు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ఈ నివేదిక నొక్కి చెప్పింది.